Breaking News

రెండు కార్లు ఎదురెదురుగా ఢీ ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఈరోజు (మంగళవారం) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 


Published on: 09 Dec 2025 12:19  IST

చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఈరోజు (మంగళవారం) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం (తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 'పోటు' కార్మికులుగా పనిచేస్తున్నారు) మరియు చెన్నైకు చెందిన అరుణ్.గాయపడిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు.తిరుచానూరు నుంచి తిరుత్తణికి వెళ్తున్న ఒక కారు, చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స కోసం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి