Breaking News

సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరిస్తున్నారు..?


Published on: 03 Dec 2025 15:58  IST

హైదరాబాద్‌లో నిన్న జరిగిన డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎందుకు వక్రీకరిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతీ విషయాన్నీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.హిందువుల్లో అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని ఎంపీ స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి