Breaking News

దైవ దర్శనం ముగించుకుని వస్తుండగా ప్రమాదం

30 జనవరి 2026, శుక్రవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా బంటుమిల్లి మండలం పెందూరు  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


Published on: 30 Jan 2026 14:20  IST

30 జనవరి 2026, శుక్రవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా బంటుమిల్లి మండలం పెందూరు  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దైవ దర్శనం ముగించుకుని, ఒకే కుటుంబానికి చెందిన భక్తులు తిరిగి వస్తుండగా వారి వాహనం అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీకొంది.ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

బాధితులందరూ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు.క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Follow us on , &

ఇవీ చదవండి