Breaking News

వెలిగొండతో వెలుగులు తెస్తాము చంద్రబాబు

ఫిబ్రవరి 25, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించి, వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు.


Published on: 26 Feb 2026 16:45  IST

ఫిబ్రవరి 25, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించి, వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను 2026 జూలై నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద రూ. 456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 2,540 కోట్లు అవసరమని, పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో పాటు కడప జిల్లాలోని ఉదయగిరి, బద్వేల్ ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.నల్లమల సాగర్ ద్వారా ప్రతి ఇంటికి రూ. 1,300 కోట్లతో సురక్షితమైన తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి