Breaking News

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్కు అగ్ని ప్రమాదం

డిసెంబర్ 29, 2025 సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18189) అగ్నిప్రమాదానికి గురైంది. 


Published on: 29 Dec 2025 10:42  IST

డిసెంబర్ 29, 2025 సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18189) అగ్నిప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున సుమారు 12:45 గంటల సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో రెండు ఏసీ బోగీలు (B1, M2) పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది.

విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు చంద్రశేఖర్ సుందర్ B1 బోగీలో సజీవ దహనమయ్యారు. మిగిలిన 150కి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, అనకాపల్లి దాటిన తర్వాత B1 బోగీ బ్రేకులు పట్టేయడం (brake binding) వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

లోకో పైలట్ మంటలను గమనించి రైలును ఎలమంచిలి వద్ద నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి, ప్రయాణికులను బస్సుల ద్వారా సామర్లకోట తరలించి అక్కడి నుండి ప్రత్యామ్నాయ బోగీలను ఏర్పాటు చేశారు.ఈ ప్రమాదం వల్ల విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 

Follow us on , &

ఇవీ చదవండి