

బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆ పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి భారత్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ తాజాగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన థాయ్లాండ్ విమానం ఎక్కి దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.