Breaking News

ఆపిల్ కంపెనీ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు $58 మిలియన్లుగా ఖరారైంది.

ఆపిల్ కంపెనీ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు Rs 551 కోట్లు ($58 మిలియన్లు) గా ఖరారైంది. 15 ఏళ్ల పాటు ఆపిల్ బాస్‌గా ఉన్న టిమ్ కుక్ (Tim Cook) స్థానంలో జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1, 2026 నుండి బాధ్యతలు స్వీకరించారు. యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ ద్వారా ఈ వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి.


Published on: 03 Sep 2026 12:59  IST

ఆపిల్ కంపెనీ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు Rs 551 కోట్లు ($58 మిలియన్లు) గా ఖరారైంది. 15 ఏళ్ల పాటు ఆపిల్ బాస్‌గా ఉన్న టిమ్ కుక్ (Tim Cook) స్థానంలో జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1, 2026 నుండి బాధ్యతలు స్వీకరించారు. యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ ద్వారా ఈ వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి.

మొత్తం ప్యాకేజీ: సుమారు Rs 551 కోట్లు ($58 మిలియన్లు).

బేసిక్ జీతం : ఏడాదికి సుమారు Rs 28.5 కోట్లు ($3 మిలియన్లు).

స్టాక్ అవార్డులు : మిగిలిన సుమారు Rs 522 కోట్లు ($55 మిలియన్లు) కంపెనీ షేర్ల రూపంలో లభిస్తుంది. ఇందులో 75% షేర్లు మార్కెట్లో ఆపిల్ కంపెనీ చూపే ప్రతిభ ఆధారంగా ఇన్సెంటివ్‌గా అందుతాయి.

టిమ్ కుక్ కొత్త జీతం: సీఈఓ పదవి నుండి తప్పుకుని, కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్‌కు సుమారు Rs 446 కోట్ల ($47 మిలియన్లు) ప్యాకేజీ లభించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement