Breaking News

కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో తుది ఘట్టమైన హల్వా వేడుక నిన్న, న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఘనంగా జరిగింది.

2026-27 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో తుది ఘట్టమైన హల్వా వేడుక నిన్న, జనవరి 27న న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఘనంగా జరిగింది. 


Published on: 28 Jan 2026 15:58  IST

2026-27 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో తుది ఘట్టమైన హల్వా వేడుక నిన్న, జనవరి 27న న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని చెప్పడానికి ఈ సంప్రదాయ వేడుక ఒక సంకేతం.ఈ వేడుక ముగియగానే బడ్జెట్ తయారీలో పాల్గొన్న సుమారు 60-70 మంది అధికారులు లాక్-ఇన్ (ఏకాంతం) లోకి వెళ్తారు.ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వీరు నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వీరికి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు, కనీసం ఫోన్ చేయడానికి కూడా వీలుండదు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి