Breaking News

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను "ఫ్రాడ్"గా వర్గీకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఏప్రిల్ 16, 2026న సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను "ఫ్రాడ్" (మోసపూరితమైనవి) గా వర్గీకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 


Published on: 16 Apr 2026 17:07  IST

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఏప్రిల్ 16, 2026న సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను "ఫ్రాడ్" (మోసపూరితమైనవి) గా వర్గీకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు IDBI బ్యాంక్ వంటి సంస్థలు అనిల్ అంబానీ ఖాతాలను "ఫ్రాడ్"గా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.అంతకుముందు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ మరియు జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.వేల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు (siphoning) తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఈ తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.

విచారణ సమయంలో అనిల్ అంబానీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తన క్లయింట్ బ్యాంకులతో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి (settlement) సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు కానీ ఆ ప్రకటనను రికార్డు చేసింది.బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసును త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి