Breaking News

మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించింది. 

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు జనవరి 29, 2026 గురువారం నాడు ఆయన రాజకీయ స్వగ్రామమైన బారామతిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. 


Published on: 29 Jan 2026 14:25  IST

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు జనవరి 29, 2026 గురువారం నాడు ఆయన రాజకీయ స్వగ్రామమైన బారామతిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. 

బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అంత్యక్రియలు నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.అజిత్ పవార్ కుమారులు పార్థ్జే పవార్ అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పు అంటించారు.

జనవరి 28న ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న లియర్‌జెట్ 45 విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించింది. 

Follow us on , &

ఇవీ చదవండి