Breaking News

తూరుబాకలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో..


Published on: 20 May 2025 18:41  IST

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద ఉన్న ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెన నిర్మాణం తక్షణం పూర్తి చేయాలని, రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తూరుబాక కల్వర్టు వద్ద బుధవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ దిగ్బంధం కార్యక్రమంలో వందలాది బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొనగా, వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం సీఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్ అండ్ బి అధికారులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి