Breaking News

9 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది.


Published on: 31 Jan 2026 17:30  IST

కామారెడ్డి జిల్లాలో 9 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన.కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది.జనవరి 30, శుక్రవారం నాడు పాఠశాలలో ఉన్న సమయంలో బాలిక వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో ఉపాధ్యాయులు ఆమెను ఇంటికి పంపించారు.

శనివారం (జనవరి 31) ఉదయం బాలిక పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ఆమెను ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC), ఆపై బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇదే జిల్లాలో కొద్దిరోజుల క్రితం బాన్సువాడ మండలంలోని బోర్లాం గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని (సంగీత) కదిలే ఆటో నుండి కిందపడి మరణించిన ఘటన కలకలం సృష్టించింది. 

Follow us on , &

ఇవీ చదవండి