Breaking News

ఎన్నికల్లో పోటీ కోసం కూతుర్ని చంపిన తండ్రి

నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డంకిగా ఉన్నారనే కారణంతో ఓ తండ్రి తన 6 ఏళ్ల కూతురిని హత్య చేసిన దారుణ ఘటన 2 ఫిబ్రవరి 2026న వెలుగులోకి వచ్చింది. 


Published on: 02 Feb 2026 19:01  IST

నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డంకిగా ఉన్నారనే కారణంతో ఓ తండ్రి తన 6 ఏళ్ల కూతురిని హత్య చేసిన దారుణ ఘటన 2 ఫిబ్రవరి 2026న వెలుగులోకి వచ్చింది. 

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, ముఖేడ్ తాలూకా, కేరూరు గ్రామానికి చెందిన పాండురంగ.మహారాష్ట్రలోని పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. పాండురంగకు ముగ్గురు పిల్లలు ఉండటంతో, సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు తన పెద్ద కూతురు ప్రాచి (6 ఏళ్లు)ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

నిందితుడు జనవరి 29న తన కూతురిని బైక్‌పై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారుకు తీసుకువచ్చాడు. అక్కడ బాలికను బతికుండగానే నిజాంసాగర్ డీ-46 కెనాల్‌లో తోసి చంపేశాడు.కెనాల్‌లో లభించిన బాలిక మృతదేహంపై పోలీసులు విచారణ జరపగా ఈ దారుణం వెలుగు చూసింది. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం, తండ్రి పాండురంగతో పాటు అతనికి ఈ ఘాతుకంలో సలహా ఇచ్చి సహకరించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement