Breaking News

రాజేంద్రనగర్లో బస్సు టైర్ పేలి ప్రమాదం.

అక్టోబర్ 17, 2025న రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.


Published on: 17 Oct 2025 10:31  IST

అక్టోబర్ 17, 2025న రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన హిమాయత్‌సాగర్ సమీపంలో జరిగింది. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో, అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. బస్సు డివైడర్‌ను దాటి, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టి, 10 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.ఈ ప్రమాదంలో బస్సు, బొలెరో డ్రైవర్లు సహా బస్సులోని 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.అదృష్టవశాత్తూ, ఆ సమయంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.బొలెరో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి