Breaking News

దసరా రోజు భార్య దీపావళి రోజు భర్త ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో, అక్టోబర్ 22, 2025న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.


Published on: 22 Oct 2025 10:13  IST

జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో, అక్టోబర్ 22, 2025న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య దసరా రోజున ఆత్మహత్య చేసుకోగా, ఆ మనస్తాపంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు.పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు.పెళ్లయిన వారం రోజుల తర్వాత, అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ రోజున, భర్త మందలించడంతో గంగోత్రి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.భార్య మరణంతో మనస్తాపానికి గురైన యువకుడు, అక్టోబర్ 22న దీపావళి రోజున బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Follow us on , &

ఇవీ చదవండి