Breaking News

వరంగల్‌ ఘోర రోడ్డుప్రమాదం వైద్యురాలు మృతి

వరంగల్‌లో జనవరి 27, 2026న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్టర్ ఎస్. మమతారాణి అనే వైద్యురాలు మరణించారు.


Published on: 27 Jan 2026 14:36  IST

వరంగల్‌లో జనవరి 27, 2026న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్టర్ ఎస్. మమతారాణి అనే వైద్యురాలు మరణించారు.కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన డాక్టర్ మమతారాణి (9 నెలల గర్భిణి). ఆమె వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు.

సోమవారం రాత్రి విధులను ముగించుకుని తన భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, హంటర్ రోడ్డులోని ఏడు మోరీల కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన ఒక టిప్పర్ లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మమతారాణిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు.

మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి, జార్ఖండ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి