Breaking News

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

నల్గొండ జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా భర్త తన భార్యను రోకలి బండతో కొట్టి చంపిన దారుణ సంఘటన ఈరోజు (నవంబర్ 17, 2025) చోటుచేసుకుంది.


Published on: 17 Nov 2025 12:07  IST

నల్గొండ జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా భర్త తన భార్యను రోకలి బండతో కొట్టి చంపిన దారుణ సంఘటన ఈరోజు (నవంబర్ 17, 2025) చోటుచేసుకుంది. సిరికొండకు చెందిన కారింగుల పద్మ (40), కారింగుల వెంకన్న గౌడ్ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం (నవంబర్ 16, 2025) రాత్రి వారిద్దరి మధ్య మళ్లీ తీవ్ర వాగ్వాదం జరిగింది.గొడవ తారాస్థాయికి చేరడంతో, వెంకన్న గౌడ్ అర్ధరాత్రి సమయంలో పద్మను రోకలి బండతో దారుణంగా కొట్టి చంపాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి