

మండల పరిధిలోని కొట్టక్కి చెక్పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి పరారైన నలుగురు నిందితుల
మండల పరిధిలోని కొట్టక్కి చెక్పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి పరారైన నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Published on: 02 Apr 2025 16:50 IST
గంజాయి అక్రమ రవాణా - నలుగురు అరెస్టు
రామభద్రపురం (విజయనగరం): మండల పరిధిలోని కొట్టక్కి చెక్పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి పరారైన నలుగురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఫిబ్రవరి 10న రామభద్రపురం ఎస్ఐ వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక కారు చెక్పోస్టు వద్ద ఆగింది. కారులో ఉన్న వ్యక్తులు పోలీసులను చూసి అక్కడే వాహనాన్ని వదిలి పారిపోయారు. పోలీసులు కారును పరిశీలించగా 147 కిలోల గంజాయి దొరికింది.
అరెస్టయిన నిందితులు:
భోగవల్లి గోవిందరావు (ఆనందపురం మండలం, విశాఖ జిల్లా)
చగురుపల్లి అనీల్కుమార్
బంక రామ్సురేష్
అంబడి బాలరాజు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శక్తి ఉమా మహేశ్వరరావు ఇదివరకే గంజాయి కేసులో అరస్టయి జైలులో ఉన్నాడు.
పోలీసుల సోదాలో స్వాధీనం చేసుకున్నవి:
147 కిలోల గంజాయి
4 మొబైల్ ఫోన్లు
ఒక కారు
ఈ కేసులో క్రియాశీలంగా పనిచేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ప్రత్యేకంగా బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, రామ భద్రపురం ఎస్ఐ వి.ప్రసాదరావు, రామభద్రపురం కానిస్టేబుళ్లు వై.రమేష్, ఎస్.రవి, ఎ.ధర్మారావు, పి.నాగార్జునలను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.