Breaking News

జనక్‌పురి ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఢిల్లీ జల్ బోర్డ్ (DJB) తవ్విన సుమారు 15 అడుగుల లోతున్న గుంతలో పడి ఒక యువకుడు మృతి

పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఢిల్లీ జల్ బోర్డ్ (DJB) తవ్విన సుమారు 15 అడుగుల లోతున్న గుంతలో పడి ఒక యువకుడు మృతి చెందాడు.


Published on: 07 Feb 2026 12:21  IST

పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఢిల్లీ జల్ బోర్డ్ (DJB) తవ్విన సుమారు 15 అడుగుల లోతున్న గుంతలో పడి ఒక యువకుడు మృతి చెందాడు.మృతుడిని 25 ఏళ్ల కమల్ ధ్యానిగా గుర్తించారు. ఇతను ప్రైవేట్ కాల్ సెంటర్‌లో పని చేసేవాడు. కమల్ గురువారం రాత్రి తన బైక్‌పై ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, సరిగ్గా ఇంటికి సమీపంలోనే ఈ గుంతలో పడిపోయాడు. గంటల తరబడి కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు శుక్రవారం ఉదయం గుంతలో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

నిర్మాణ ప్రాంతం వద్ద సరైన బారికేడ్లు, లైటింగ్ లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఇంజనీర్లను (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్) తక్షణమే సస్పెండ్ చేసింది.మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

Follow us on , &

ఇవీ చదవండి