Breaking News

హాలియా పట్టణంలో మహిళా దారుణ హత్యా

నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో జరిగిన ఒక దారుణ హత్యోదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది .


Published on: 31 Jan 2026 16:27  IST

నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో జరిగిన ఒక దారుణ హత్యోదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది .హాలియా రెడ్డి కాలనీకి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ (67), ఈమె వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఒంటరిగా నివసిస్తోంది.రావలసిన బాకీ డబ్బులు (సుమారు రూ. 1,300) అడగడానికి వెళ్లిన అనసూయమ్మను, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు దారుణంగా హత్య చేశారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే చిన్నపాక రాములు, అతని భార్య ధనలక్ష్మి, కుమారుడు గౌరి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు.

నిందితులు ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును కాజేసి, మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా హోటల్ వెనుక భాగంలో పూడ్చిపెట్టారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow us on , &

ఇవీ చదవండి