Breaking News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్


Published on: 15 May 2025 10:29  IST

జమ్మూకశ్మీర్‌ అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాగా జమ్మూకశ్మీర్‌లో గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్.సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి