Breaking News

జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చివ‌రి క్ష‌ణాలు..!


Published on: 15 May 2025 16:24  IST

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. థ్రాల్‌ ప్రాంతంలోని నదిర్‌ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మ‌హమ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థకు చెందిన ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజీర్‌ వనీ, యవర్‌ అహ్మద్‌ భట్‌ ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. అయితే జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న చివ‌రి క్ష‌ణాల‌ను ఇండియ‌న్ ఆర్మీ విడుద‌ల చేసింది. డ్రోన్ ఫుటేజీను విడుద‌ల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి