Breaking News

రేవంత్ రెడ్డి త‌న త‌ప్పు ఒప్పుకోవాలి : కేటీఆర్


Published on: 15 May 2025 16:31  IST

హైదరాబాద్ కంచ‌ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా అంటూ హెచ్చరించింది.రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. వీటన్నింటికీ తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి