Breaking News

చైనా వైమానిక రక్షణ వ్యవస్థను జామ్‌ చేసిన భారత వాయుసేన


Published on: 15 May 2025 16:36  IST

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత రక్షణ దళం మరో ఘనత సాధించింది. సరిహద్దులో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం విజయవంతంగా స్తంభింపజేసింది. దీంతో కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని బుధవారం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి