Breaking News

కాకాణి కోసం ముమ్మరంగా గాలింపు..


Published on: 15 May 2025 17:53  IST

క్వార్జ్ కేసులో ఏ4 గా ఉన్నా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి