Breaking News

ప్రయాణికులపై హైదరాబాద్ మెట్రో బాదుడు


Published on: 15 May 2025 18:07  IST

హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుందని ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీలు పెంపు అనివార్యమని స్పష్టం చేసింది. ప్రయాణికులపై ఛార్జీల వడ్డింపునకు రంగం సిద్దమైంది. ఇకపై మెట్రో రైలు టికెట్ ధర కనిష్టంగా రూ. 12 కాగా.. గరిష్టంగా రూ. 75 ఉండనుంది. ప్రస్తుతం మెట్రో రైలు టికెట్ కనిష్ట ధర రూ. 10.. గరిష్టంగా రూ. 60 గా ఉంది. ఈ పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ గురువారం ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి