Breaking News

పాకిస్థాన్ ప్రధాని- చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి


Published on: 16 May 2025 10:31  IST

భారత్‌తో శాంతి కోసం చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీప్‌ అన్నారు. అయితే చర్చల్లో కశ్మీర్‌ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, భారత్‌తో చర్చలకు సిద్ధమన్నారు. పాక్‌ శాంతిని కోరుకుంటుందని షెహబాజ్‌ పేర్కొన్నారు. అయితే, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి