Breaking News

వైకాపా నేత వల్లభనేని వంశీపై మరో కేసు


Published on: 16 May 2025 13:42  IST

వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.

Follow us on , &

ఇవీ చదవండి