Breaking News

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో స్వతంత్ర భారత తొలి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిన్న, ఫిబ్రవరి 23, 2026న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోస్వతంత్ర భారత తొలి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


Published on: 24 Feb 2026 16:49  IST

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిన్న, ఫిబ్రవరి 23, 2026న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోస్వతంత్ర భారత తొలి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) విగ్రహాన్ని ఆవిష్కరించారు. అశోక మండపం సమీపంలోని గ్రాండ్‌ ఓపెన్‌ మెట్ల (Grand Open Staircase) వద్ద, మహాత్మా గాంధీ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ విగ్రహం ఉన్న చోట ఇప్పుడు రాజాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వలసవాద ఆనవాళ్లను తొలగించి భారతీయతకు పెద్దపీట వేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఆవిష్కరణ సందర్భంగా ఫిబ్రవరి 23న 'రాజాజీ ఉత్సవ్' నిర్వహించారు.

నేటి నుండి, అనగా ఫిబ్రవరి 24, 2026 నుండి మార్చి 1 వరకు, రాజగోపాలాచారి జీవితం మరియు ఆయన దేశానికి చేసిన సేవలను వివరిస్తూ రాష్ట్రపతి భవన్‌లో ఒక ప్రత్యేక ప్రదర్శన ప్రజల కోసం అందుబాటులో ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి