Breaking News

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలు..


Published on: 20 May 2025 11:18  IST

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లలో గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్‌-ఇన్‌ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించింది. లోపాలను ఆసరా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు విలువైన డేటాను తస్కరించేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పనిసరిగా అందరూ గూగుల్‌ క్రోమ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. విండోస్‌, మ్యాక్‌ ఓఎస్‌, లినక్స్‌ యూజర్లకు ప్రత్యేకంగా హెచ్చరికలు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి