Breaking News

తూర్పుగోదావరిలో పాముకాటుకు బాలిక మృతి

కాకినాడ జిల్లాలో (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా) శుక్రవారం, 10 ఏప్రిల్ 2026న పాము కాటుకు గురై 14 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన జరిగింది.


Published on: 10 Apr 2026 16:39  IST

కాకినాడ జిల్లాలో (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా) శుక్రవారం, 10 ఏప్రిల్ 2026న పాము కాటుకు గురై 14 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన జరిగింది.చొక్కా దీపిక (14), స్థానిక జిల్లా పరిషత్ (ZP) పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.యు.కొత్తపల్లి మండలం, కోనపాపపేట గ్రామంలోని జగనన్న కాలనీ.

ఏప్రిల్ 9, గురువారం రోజున దీపిక తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతో సంతోషంగా జరుపుకుంది. అదే రోజు రాత్రి పనులు పూర్తి చేసుకుని మంచంపై నిద్రిస్తుండగా, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక విషసర్పం (త్రాచుపాము) ఆమెను కాటు వేసింది.బాలిక కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు వేడుకల మరుసటి రోజే ఈ విషాదం జరగడంతో ఆ కుటుంబంలో మరియు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి