Breaking News

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత కన్నుమూత


Published on: 20 May 2025 14:42  IST

డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ ఇక మన మధ్య లేరు. ఆయన ప్రఖ్యాత ఖగోళ, సైన్స్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి గాంచారు. ఆయనకు 1965లో 26 ఏళ్లకు చిన్న వయసులోనే పద్మభూషణ్ లభించడం విశేషం, 2004లో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం కూడా లభించింది. అలాంటి డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ మంగళవారం పూణేలో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, డాక్టర్ నార్లికర్ మంగళవారం ఉదయం నిద్రలోనే మరణించారు.

Follow us on , &

ఇవీ చదవండి