Breaking News

అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఛేదించి, ఇరాన్‌కు చెందిన ఒక సూపర్‌ ట్యాంకర్ సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా చేరవేసి ఇరాన్ జలాల్లోకి ప్రవేశించింది.

అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) ఛేదించి, ఇరాన్‌కు చెందిన ఒక సూపర్‌ ట్యాంకర్ సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా చేరవేసి, 2026 ఏప్రిల్ 21న తిరిగి ఇరాన్ జలాల్లోకి ప్రవేశించింది.


Published on: 22 Apr 2026 10:56  IST

అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) ఛేదించి, ఇరాన్‌కు చెందిన ఒక సూపర్‌ ట్యాంకర్ సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా చేరవేసి, 2026 ఏప్రిల్ 21న తిరిగి ఇరాన్ జలాల్లోకి ప్రవేశించింది. 

ఈ భారీ నౌక మార్చి నెలలో ఇరాన్ నుంచి ఇండోనేషియాకు బయలుదేరింది.రియూ (Riau) ద్వీప సమూహం వద్దకు చేరుకున్న తర్వాత, తన వద్ద ఉన్న 20 లక్షల బ్యారెళ్ల చమురును మరో సూపర్‌ ట్యాంకర్‌లోకి బదిలీ చేసింది.

అమెరికా రాడార్ల నిఘా మరియు దిగ్బంధనాన్ని తప్పించుకుని ఈ మిషన్‌ను పూర్తి చేయడం విశేషం. దీన్ని అమెరికా దిగ్బంధనంపై సాధించిన విజయంగా ఇరాన్ పేర్కొంది.ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడటంతో, సుమారు ఏడేళ్ల తర్వాత భారత్ మళ్లీ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను పునరుద్ధరించింది.పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 28 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటి భద్రతను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల హార్ముజ్ జలసంధి వద్ద భారతీయ నౌకలపై జరిగిన కాల్పుల ఘటనలతో అప్రమత్తత పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement