Breaking News

రెండు రైళ్లను పట్టాలు తప్పించే ప్రయత్నం..!


Published on: 20 May 2025 16:03  IST

పోలీసుల సమాచారం ప్రకారం, దలేల్‌నగర్, ఉమర్‌తాలి స్టేషన్ల మధ్య పట్టాలకు సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్తింగ్ వైర్‌ను ఉపయోగించి చెక్క పలకలు కట్టారు. ఢిల్లీ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (20504) లోకో పైలట్ సకాలంలో ట్రాక్‌పై అడ్డంకులు ఉన్నట్టు గ్రహించి అత్యవసర బ్రేకులు వేశారు. రైలు ఆగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, కాఠ్‌గోదామ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా పట్టాలు తప్పిచేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అయితే లోకో‌పైలెట్ సకాలంలో దీనిని గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి