Breaking News

నేపాల్ దేశాన్ని కుదిపేసిన భూకంపం


Published on: 20 May 2025 16:47  IST

నేపాల్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. 2025, మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో ఊగిపోయింది నేపాల్ దేశం. పోఖారా ఏరియాకు సమీపంలోని కాస్కి జిల్లా కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటించింది. భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది. కస్కిలోనే కాకుండా సియాంజ్గా, తనహున్, పర్బాత్, మయాగ్డి, బాగ్లంగ్ జిల్లాల్లోనూ భూమి కంపించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి