Breaking News

టీ.కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలికి షోకాజ్ నోటీస్


Published on: 21 May 2025 16:00  IST

తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతా రావుకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్‌లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుబట్టింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సునీతా రావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసు జారీ చేశారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని నోటీసులో అధిష్టానం స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి