Breaking News

కాళ్లపై పడినా.. కనికరించని కడియం..


Published on: 03 Jun 2025 15:01  IST

తన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ ఓ మహిళ కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లపై పడినా పట్టించుకోని ఘటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. మరొక వైపు ఇండ్లు, భూములు లేని నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలంటూ సమావేశం మధ్యలో ప్లెక్సీ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఓ దంపతులు. దీంతో అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారని, రెండో విడతలో మళ్లీ వస్తాయని కడియం నచ్చజెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి