Breaking News

పొదిలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ


Published on: 11 Jun 2025 15:37  IST

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్లారు. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా జగన్‌కు నిరసన సెగ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో అడుగడుగునా నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి