Breaking News

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం..భగ్గుమన్న చమురు ధరలు


Published on: 13 Jun 2025 17:00  IST

ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 12 శాతం పైగా పెరిగాయి. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ బ్యారెల్‌ 12.6 శాతం పెరిగి 76.61 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్‌ నార్త్‌ సీ క్రూడ్ 12.2 శాతం పెరిగి 77.77 డాలర్లకు చేరింది.ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతావరణం చమురు ధరలపై ప్రభావం చూపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి