Breaking News

మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం


Published on: 16 Jun 2025 18:45  IST

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్‌ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వశాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం ఏంటని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

Follow us on , &

ఇవీ చదవండి