Breaking News

రైతులకు గుడ్ న్యూస్ రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు


Published on: 16 Jun 2025 19:01  IST

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు సంబంధించిన పైసలు.. రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు వెల్లడించారాయన. 2025, జూన్ 16వ తేదీ హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 17వ తేదీ.. మంగళవారం నుంచి రైతు బ్యాంక్ ఖాతాల్లో.. రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారాయన. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు స్పష్టం చేశారు సీఎం.

Follow us on , &

ఇవీ చదవండి