Breaking News

జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి


Published on: 18 Jun 2025 12:58  IST

బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అందుకోసం ఆయన భారీ కాన్వాయ్‌తో రెంటపాళ్లకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయలుదేరారు. ఆ క్రమంలో జాతీయ రహదారిపై ఏటూకురు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి.. 108కి సమాచారం అందించారు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు.

Follow us on , &

ఇవీ చదవండి