Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి


Published on: 19 Jun 2025 10:29  IST

మహారాష్ట్ర పుణె జిల్లాలోని జేజూరి - మోర్గాన్ రహదారిపై టెంపోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జేజూరిలోని శాంతాయ్ ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుంచి రిఫ్రిజరేటర్‌ను వ్యక్తులు కిందకి దింపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి