Breaking News

ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన..


Published on: 19 Jun 2025 15:16  IST

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది. వైడ్‌బాడీ విమాన కార్యకలాపాలను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.వైడ్‌బాడీ బోయింగ్‌ 777 విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి