Breaking News

ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం..?


Published on: 19 Jun 2025 17:34  IST

సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? కొత్త ట్రైబ్యునల్‌ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి అని చంద్రబాబు అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి