Breaking News

బుగ్గ మఠం భూములపై పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు


Published on: 23 Jun 2025 15:39  IST

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుగ్గ మఠం భూముల పై సుప్రీం కోర్టు లో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై సోమవారం జస్టిస్ కేవీ. విశ్వనాధన్, జస్టిస్ ఎన్‌కే. సింగ్ ధర్మాసనం విచారణ చేసింది. దీనికి సంబంధించి హైకోర్టునే ఆశ్రయించాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం సూచించింది. అంతవరకూ బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు యథాతధా స్థితి కొనసాగించాలని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి