Breaking News

కాళేశ్వరంపై . .రాజాసింగ్ హాట్ కామెంట్స్


Published on: 23 Jun 2025 16:35  IST

బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే గులాబీ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఇవాళ(సోమవారం) ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టే‌నని ఆయన ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి