Breaking News

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో భారీ చోరీ


Published on: 24 Jun 2025 12:04  IST

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న ఏఈ శరభారెడ్డి నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇటీవల ఆయన కుమార్తె వివాహం జరగడంతో పోస్టు వెడ్డింగ్‌ షూట్‌ కోసం కుటుంబసభ్యులు నల్లకాల్వ సమీపంలోని వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి వెళ్లారు. ఇదే అదనుగా దుండగులు ఇంటి తలుపులు పగటగొట్టి చోరీకి పాల్పడ్డారు. బెడ్‌రూమ్‌లోని బీరువాలో ఉన్న దాదాపు 60 తులాల బంగారుతో పాటు పక్కనే కబోర్డులోని సూట్‌కేసులో ఉంచిన రూ.27లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి