Breaking News

24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు..


Published on: 24 Jun 2025 12:51  IST

హిమాచల్‌ ప్రదేశ్‌ లో పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. గణితం బోధిస్తున్న ఉపాధ్యాయుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్‌ ఇచ్చారు. తమను అసభ్యకరంగా తాకాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రిన్సిపల్‌.. విద్యాశాఖ అధికారులు, లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన విద్యాశాఖ ఉన్నతాధికారులు..సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి