Breaking News

చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ


Published on: 24 Jun 2025 14:51  IST

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ముంబయి నుంచి చెన్నైకి వెళ్లే చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కత్తిరించారు. తాడపత్రి వద్ద సిగ్నల్ చూపకపోవడంతో రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే ఎస్ 1, ఎస్ 2 బోగిల్లోకి ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి